6, జూన్ 2013, గురువారం

నిజమైన తల్లి కావాలి :



దేశంలో మాత్రు శక్త్రి పెరగాలి. తన సంతానం దేశ హితం కొరకు పనిచేయాలి అనే ఆలోచన కలికిగిఉన్న   మాత్రు మూర్తుల  సంఖ్య పెరగాలి. తన సంతానాన్ని అవిటివాడిగా, స్వార్ధపరుడిగా, లోభిగా, శక్తి హినుడిగా, ఆధారపడి బ్రతికే వాడిలా కాకుండా,

సింహంలా, సమాజానికి ఉపకారం చేసేవాడిలా, నిజాయితీ పరుడిలా, నిస్వార్ధపరుడిలా, శివాజీ మహారాజ్ లా, భగత్ సింగ్ లా, ఝాన్సి రాణిలా అందరికొరకు నా సంతానం, నా పిల్లలు బ్రతకాలి అనుకునే తల్లులు దేశానికి కావాలి.

వెకిలి వేషాలు వేస్తూ, చిలిపి చేష్టలు చేస్తూ, పిచ్చి రాతలు రాస్తూ ఎదుటి వారిని పనికిమాలిన ఊహలలో ముంచి, చేతకాని చవటలుగా, దద్దమలుగా సమాజాన్ని తయారుచేసి తనచుట్టూ తిప్పుకునే ఆడది సమాజానికి అవసరం లేదు.

ఎందుకంటే తల్లి మాత్రమె సమాజాన్ని దిద్దగలదు. ఎందుకంటే మొదటి  గురువు తల్లే కావున. సమాజం బాగుపడినా, చెడిపోయినా దానికి కారణం తల్లి మాత్రమే.

షాహ్జి భోంస్లే తనని వదలి వెళ్ళినా, శివాజీని వెన్నంటి వీర సింహాన్ని తయారుచేసినా,  17 ఏళ్ళ ప్రాయంలో ఉరితాడు ను పులమాలగా ధరించేలా భగత్సింగ్ ను తీర్చి  దిద్దిన, నిజ ధర్మం కొరకు పరాయివారి ముందు ఎలుగెత్తి నినదిన్చేలా స్వామీ వివేకానందను పెంచినా, బ్రిటిష్ దోపిడీ వ్యవస్తను కాలరాసేలా ఎదిరించి పెద్ద  సైన్యాన్ని తయారుచేసి యుద్ధం ప్రకటించేలా  సుభాష్ బోసును తయారుచేసినా, కాలినడకతో తెల్లవారిని తరిమేసెలా బాపూజీని పెంచినా  ( ఇవి కొన్నిమాత్రమె )  అది తల్లి ఘనతె.

ఈరోజు అమ్మ అందుకు వ్యతిరేకంగా భావి భారత దేశాన్ని నడిరోడ్డు న వదలి డబ్బు సంపాదనలో తిరగడం చాలా విచారకరం, బాధాకరమ్. సమ్పాదించాలి. కాని పిల్లలకు సంస్కారం నేర్పెడేవారు ?  ఇది పెద్ద ప్రశ్న......

తల్లి శక్తివంతం కావాలి.  డాక్టర్లు, ఇంజనీర్లు కాదు, నిజమైన తల్లులు కావాలి. ... దేశానికి నిజమైన తల్లులు  కావాలి .....



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి